కర్ణాటక మద్యం పట్టివేత….

గద్వాల రూరల్ జూలై 06 (జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లా లో మంగళవారం  సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కేటి దొడ్డి మండలం లోని నందిన్నే గ్రామం లో కర్ణాటక సరిహద్దుకు ఆనుకొని ఉన్న మద్య నిషేధ మరియు అబ్కారీ చెక్ పోస్ట్ వద్ద నరేందర్ రెడ్డి ,ఇన్స్పెక్టర్ తన సిబ్బంది తో వాహనాల తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి ద్విచక్ర వాహనం మీద రాయచూరు వైపు నుండి రావడం గమనించి ఆపి తనిఖీ చేయగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన 110  ఒరిజినల్ ఛాయిస్ విస్కీ టెట్రా పాకెట్ ఒక్కోటి 180 ఎంఎల్ ఉంటుందని, వాహనాన్ని ,మద్యాన్ని స్వాధీనం చేసుకొని నిందితున్ని అదుపులోకి తీసుకొని అబ్కారీ స్టేషన్ గద్వాల్ నందు అప్పగించారు.నిందితుడు కృష్ణ గౌడ్  జమ్మిచెడ్, గద్వాల్ మీద కేసు నమోదు చేశారు.ఈ తనిఖీల్లో ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి, పోలిస్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బా రెడ్డి,కానిస్టేబుళ్లు జగదీష్,సురేష్, శాలి పాషా లు పాల్గొన్నారు..