*కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న ఏపీఓ కుమారస్వామి గౌడ్

 

కొడకండ్ల 08(జనం సాక్షి):* ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వారోత్సవాల సందర్భంగా కొడకండ్ల మండలంలోని ఏపీఓ విధులు నిర్వహిస్తున్న నరిగే కుమారస్వామి గౌడ్ జిల్లా కలెక్టర్ మరియు ఆడిషనల్ కలెక్టర్ చేతులు మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. మహాత్మాగాంధీ ఉపాధి పథకం లో దివ్యాంగులకు ఎక్కువ పని దినాలు కల్పించినందుకు గాను ప్రశంస పత్రం ఇచ్చి సత్కరించారు. దివ్యాంగులను ఇకనుండి మండలంలో ఇంకా అధిక సంఖ్యలో ఉపాధి కల్పించాలని అందరూ దివ్యాంగులకు అవగాహన చేసి ఉపాధి హామీ పథకంలో వాళ్లకు అనుకూలమైన పనులు కల్పించాలని, వారికి పల్లె ప్రకృతి వనాలలో బృహత్ పీపీవీ లో నర్సరీలలో వాచర్లగా పెట్టాలని కలెక్టర్ లు ఆదేశించారు. ఇకముందు ఇంకా అతి ఉత్సాహంగా పనిచేసి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. ఈ సన్మాన సత్కారం ఏడునూతుల పంచాయతీ కార్యదర్శి, ఉపేందర్ మొండ్రాయి ఫీల్డ్ అసిస్టెంట్ మోతిరాo, నర్సింగాపురం దివ్యాంగురాలు జీడి చంద్రకళ వీరికి వందరోజుల పని దినాలు పూర్తయినందున వారిని సన్మానించారు.ఈ కార్యక్రమాలు DRDA PD రామిరెడ్డి, ఐకెపి ఈజిఎస్ సిబ్బంది వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.