కల్వకుర్తిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పూలాభిషేకం

నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో అక్టోబర్ 17 జనం సాక్షి:
దేశంలో ఉన్న ప్రతి చిన్న సన్న కారు రైతులందరికీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి లో భాగంగా 2000 రూపాయలను ప్రతి రైతు అకౌంట్లోకి జమ చేయడం దేశ చరిత్రలో గొప్ప పథకమని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కల్వకుర్తి పట్టణ అధ్యక్షులు నరెడ్ల రాజేందర్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఈరోజు కల్వకుర్తి పట్టణంలోని రైతు పొలంలో   ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పూలాభిషేకం చేశారు.   పేద ప్రజల కోసం నిరంతరం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ   ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తూ అవినీతి రహిత పాలన కొనసాగిస్తుంద న్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి బిజెపి పట్టణ అధ్యక్షులు బోడ నరసింహ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్. సీనియర్ నాయకులు దుర్గాప్రసాద్. జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్. ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు
Attachments area