కశ్మీర్లో కొనసాగుతున్న ఆందోళనలు
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్లోని షోపియన్ జిల్లాలో ఆదివారం ఉదయం నిర్మాణంలో ఉన్న మినీ సచివాలయ భవనానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు చేసేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘటనలో 50 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. కశ్మీర్లో హింసాత్మ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ నేతృత్వంలో వివిధ పార్టీలకు చెందిన 30 మంది ఎంపీల బృందం ఇవాళ కశ్మీర్లో పర్యటిస్తోంది.
హిజ్బుల్ ముజాహిద్దీన్ నేత బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్లో ఘర్షణలు చెలరేగాయి. 58 రోజులుగా జరుగుతున్న ఆందోళనల కారణంగా సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.