కశ్మీర్‌ చేరుకున్న అఖిలపక్ష బృందం

జమ్ముకశ్మీర్‌: బుర్హాన్‌ వానీ ఎన్‌కౌంటర్‌ తర్వాత కశ్మీర్‌లో నెలకొన్న పరస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలోని అఖిలపక్ష బృదం జమ్ముకశ్మీర్‌ చేరుకుంది. వివిధ పార్టీలకు చెందిన 30మంది ఎంపీల బృందం ఇవాళ, రేపు కశ్మీర్‌లో పర్యటించనుంది. హింసాత్మక ఘటనల్లో గాయపడిన ప్రజలు, సైనికులను అఖిలపక్ష బృందం పరామర్శించనుంది. ఈ సందర్భంగా హురియత్‌ నేతలతోనూ అఖిలపక్షం సమావేశం కానుంది.