కష్టపడి చదివితే ఉన్నత శిఖరాల అధిరోహించవచ్చు…

అనంతగిరి, జనంసాక్షి:
విద్యార్థులు కష్ట పడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని గొండ్రియాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  ప్రధానోపాధ్యాయులు హరికిషన్ రావు అన్నారు.శుక్రవారం అనంతగిరి మండలం లోని గొండ్రియాల  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి లో 9.7 గ్రేడ్ సాధించి బాసర త్రిబుల్ ఐటీ లో సీటు సాధించిన చందనా దేవినీ ఉపాధ్యాయుల తో కలిసి అభినందించి మాట్లాడారు. చందాన దేవిని ఆదర్శంగా తీసుకొని ఈ ఏడాది పదవ తరగతి చదివే విద్యార్థులు మంచి గ్రేడ్ సాధించి ఉన్నత విద్యా అవకాశాలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగజ్యోతి, అశోక్ రెడ్డి, మండవ ఉపేందర్,బాలాజీ, లక్ష్మీ నరసయ్య, విజయ్, వెంకటరత్నం, జానకి రాములు, పి.ఈ.టీ గంధం రంగారావు తదితరులు పాల్గొన్నారు.