కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం …వడ్డెపల్లి

రామారెడ్డి     జులై 29   జనంసాక్షీ :
కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం అని ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ  కో-అర్డినేటర్  వడ్డెపల్లి శుబాష్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామ సేవకుల నిరవదిక సమ్మె నేపథ్యంలో వారికి మద్దత్తు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని అన్నారు. వీఆర్ఎల మనోవేదనను  అర్థం చేసుకోవడం సీఎం కేసీఆర్ కి లేదన్నారు. వారు కోరేది ఉద్యోగ భద్రత కోసం పేస్కేల్ ఇవ్వాలని కోరారు. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలేదని ఎద్దేవా చేశారు. పేస్కేల్ ఇచ్చెంత వరకు గ్రామ సేవకులకు అండగా ఉంటామన్నారు. ఆయన వెంట రామారెడ్డి జడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , కార్యకర్తలు, వీఆర్ఎలు తదితరులు పాల్గొన్నారు