కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కి సన్మానం

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కి సన్మానం

జనం సాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 26 : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆడెపు రమేష్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియామకం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జూలపల్లి పద్మశాలి సంఘం సభ్యులు ఆడెపు రమేష్ ని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలోపద్మశాలి సంఘం మండల ప్రధాన కార్యదర్శి మెరుగు వెంకటేశ్వర్లు, జూలపల్లి పద్మశాలి సంఘం సభ్యులు చిటికెన రవి, బండి లింగస్వామి, నీరుకుల్లా గణపతి, దాసరి శంకరయ్య, దాసరి లింగయ్య, బండి సమ్మయ్య, ఆడెపు రవి, బండి రాజేశం, కుంట శంకర్, బండి శంకర్, ఆడపు సమ్మయ్య, బండి నరసయ్య, బండి పోశెట్టి, బండి రాయ మల్లు తదితరులు పాల్గొన్నారు.