కాంగ్రెస్ పార్టీ మైనారిటి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన యండి.సిరాజుద్దీన్

పానుగల్ సెప్టెంబర్ 25,జనం సాక్షి
 కాంగ్రెస్ పార్టీ మైనారిటి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యండి.సిరాజుద్దీన్ ఎన్నికైనట్లు కొల్లాపూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యండి.వహీద్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యండి.సిరాజుద్దీన్ ఎన్నికైనందున నియోజకవర్గ యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో యండి.సిరాజుద్దీన్ కి శాలువలు కప్పి సన్మానించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా యండి.సిరాజుద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని,కష్టపడే ప్రతి సాధారణ కార్యకర్తకి కూడా అసాధారణ పదవులు కల్పించే గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ ప్రధాన కార్యదర్శి బండారు రమేష్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇలియాస్ యువ నాయకులు అంబటి ప్రవీణ్, గోపాల్ నాయుడు, అంజి, సద్దాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు .