కాంగ్రెస్ పార్టీ లోకి చేరికలు

జనంసాక్షి, రామగిరి అక్టోబర్ 27 : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం
నవాబుపేట్ బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఓలపు బాపు, వార్డ్ మెంబర్ చెగర్ల తిరుపతి, వార్డ్ మెంబర్ రామినేని రవి, చేగర్ల సారయ్య, గాజుల శ్రీను, గాదం అబి, మాచర్ల వెంకటేష్, ఉదరి అజయ్ తదితరులు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నవాబ్ పెట్ గ్రామ శాఖ అధ్యక్షులు అయిందాల కొమురయ్య, క్లస్టర్ కన్వీనర్ మద్దెల భూమయ్య, చెగర్ల కుమార్, మాజీ ఉప సర్పంచ్ అశోక్, వార్డ్ నెంబర్ బోనగిరి రాజేందర్రాజేందర్, మాల్లోరు మలరెడ్డి ,సిగనవేన ఐలు కుమార్, సందేల కుమార్, తీగల రాజమల్లు, తురుపటి ఐలమ్మ, గోగుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.