కాంగ్రెస్ పాలన తెచ్చుకుందాం మన బ్రతుకులను మనమే మార్చుకుందాం… కాంగ్రెస్ నేత డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ

కాంగ్రెస్ పాలన తెచ్చుకుందాం మన బ్రతుకులను మనమే మార్చుకుందాం-కాంగ్రెస్ నేత డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ

జనగామ ప్రతినిధి(జనంసాక్షి) సెప్టెంబర్ 23 : ఆరు డిక్లరేషన్లతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే తత్వం సోనియా గాంధీదని కాంగ్రెస్ నేత డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ అన్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ జాఫర్గడ్ లో గడప గడపన ప్రచారం నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోయే ఆరు డిక్లరేషన్ లను ప్రకటించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటి మహిళకు మహాలక్ష్మి పేరుతో నెలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు అదేవిధంగా ఎంతోమంది ఇల్లు లేకుండా బాధపడినప్పుడు ఆనాడు ఇందిరమ్మ పేరుతో ఎంతోమందికి ఇండ్లు కట్టించడం జరిగిందని నేడు గృహలక్ష్మి పేరుతో ప్రతి కుటుంబానికి 5 లక్షలతో ఇల్లు కట్టించడం జరుగుతుందని , వృద్ధాప్యంలో కొడుకు కూతురు అండ లేకుండా బాధపడే వృద్ధులకు 4000 రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేయడం జరుగుతుందని అన్నారు. గృహ జ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుందని రైతులకు ప్రతి ఏటా 15 వేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేయడం జరుగుతుందని . తెలంగాణ రాష్ట్రంలో యువత చదువుకోవడం కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి కోసం ప్రత్యేకంగా యువ వికాసం పేరుతో ఐదు లక్షల రూపాయలతో విద్యా భరోసా కార్డు అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు భేతి జయపాల్ రెడ్డి, జఫర్గడ్ మండల మాజీ జెడ్పిటిసి పట్టపురి సదయ్య గౌడ్, జఫర్గడ్ మండల గ్రామ ఉపసర్పంచ్ యాదగిరి, ధర్మసాగర్ మండల మాజీ అధ్యక్షులు తూటి నరసింహారెడ్డి, స్టేషన్గన్పూర్ మండల సీనియర్ నాయకులు చింత దేవదాస్,జఫర్ గఢ్ సీనియర్ నాయకులు డా. సోమనరాయన, మంగలంపల్లి అంజయ్య, ముప్పారం గ్రామ సీనియర్ నాయకులు కొరిమి సతీష్, సోమదేవరపల్లి యూత్ నాయకులు చార్లెస్ తదితరులు పాల్గొన్నారు.