కాంబోడియాకు బయలుదేరిన ప్రధాని

ఢిల్లీ: ఆసియాన్‌, తూర్పు ఆసియా సదస్సుల్లో పాల్గోనేందుకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ఆదివారం కాంబోడియా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన చైనా సహా పలుదేశాల నేతలతో భేటీ అవుతారు. భారత్‌ -ఆసియాన్‌ దేశాల మధ్య పెట్టుబడి, వాణిజ్యాన్ని పెంచాల్సి అవసరాన్ని కాంబోడియా రాజధాని నాంఫెన్‌ సదస్సులో మన్మోహన్‌ ప్రస్తావించనున్నారు.