కాన్పసూర్‌ ఆస్పత్రిలో మరో ఘోరం

ఎసి పనిచేయక నలుగురు పేషెంట్ల మృతి

కాన్పూర్‌,జూన్‌8(జ‌నం సాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. గణెళిశ్‌ శంకర్‌ విద్యార్థి మెమోరియల్‌ మెడికల్‌ కాలేజీలో ఏసీ వ్యవస్థ నిలిచిపోవడంతో ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉన్న నలుగురు పేషెంట్లు మృతిచెందారు. కొందరు పేషెంట్లను ఇతర ఆస్పత్రులకు తరలించారు. సెంట్రల్‌ ఏసీ రిపేర్‌ చేసే వరకు అత్యవసరంగా రెండు ఎయిర్‌ కండీషనర్లను ఏర్పాటు చేయాలని జిల్లా మెజిస్టేట్ర్‌ ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. హాస్పటల్లో రెండు ఏసీ యూనిట్లు ఉన్నాయి. కానీ కొన్ని టెక్నికల్‌ పొరపాట్ల వల్ల ఏసీ సిస్టమ్‌ పనిచేయలేదని హాస్పటల్‌ ప్రిన్సిపాల్‌ నవ్‌నీత్‌ కుమార్‌ తెలిపారు.