కార్తీ చిదంబరంపై మరో కేసు

న్యూఢిల్లీ,జూన్‌13(జ‌నం సాక్షి): మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపై మరో చార్జిషీట్‌ నమోదు చేయనున్నట్లు ఇడి అధికారులు తెలిపారు. ఎయిర్‌సెల్‌ామ్యాక్సిస్‌ కేసులో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఒపి సైనీ ఎదుట ఇడి మరో చార్జిషీట్‌ను నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో కార్తీ చిదంబరంతో పాటు మరికొందరి పేర్లను ఈ చార్జిషీట్‌లో ప్రస్తావించనున్నట్లు సమాచారం. మనీల్యాండరింగ్‌ నియంత్రణ చట్టం కింద ఈ కేసులో అధికారులు ఇప్పటికే కార్తీ చిదంబరాన్ని రెండు సార్లు ప్రశ్నించడంతో పాటు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.