కార్మికుల సమస్యలు పరిష్కరించాలి…

సిఐటియు జిల్లా కార్యదర్శి ఆకుల రాజు

కేసముద్రం సెప్టెంబర్ 18 జనం సాక్షి /మండల కేంద్రంలో ఆదివారం సిఐటియు ఐదవ మండల మహాసభ ఎండి సలీమా బేగం అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి సిఐటియు జిల్లా కార్యదర్శి ఆకుల రాజు పాల్గొని మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి ఎన్నికలు ముగిసిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని అన్నారు. కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం నిత్యవసర సరుకులపై అధిక ధరలు పెంచి పేద మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ ఆస్తులను బడా పెట్టుబడి దారులకు కట్టబెడుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలను నిరుద్యోగులను గందరగోళానికి గురి చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నిత్యవసర వస్తువులపై పెంచిన ధరలు తగ్గించాలి ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని 57 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్లు ఇవ్వాలని,కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసినారు. ఈ మహాసభలో కన్వీనర్ కమిటీని ఎన్నుకోవడమైనది. కేసముద్రం మండలం కన్వీనర్ జల్లే జయరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ కార్మికుల ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు నియమకానికి కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా,కమిటీ మెంబర్స్ గా ఎండి సలీమా బేగం,గాడి పెళ్లి ప్రమీల, దారావతు లక్ష్మి, ఈదునూరు బుచ్చమ్మ , పసునూరి కటాక్ష, చింతల వెంకటమ్మ ,నామిండ్ల నాగేంద్ర ,జల్లంపల్లి శ్�