కాశ్మీర్‌లో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి

005-oct-06
– రాజ్‌నాథ్‌ సింగ్‌

లెహ్‌,అక్టోబర్‌ 3(జనంసాక్షి):పాక్‌ ఉగ్ర ముష్కరుల దాడులకు భద్రతా దళాలు గట్టిగా బదులిస్తున్నాయని ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆయన సోమవారం లెహ్‌ సందర్శించారు. భారత సర్జికల్‌ దాడుల తర్వాత టెర్రరిస్టులు తొలిసారి ఆదివారం అర్ధరాత్రి భారత సైన్యం, బీఎస్‌ఎఫ్‌లకు చెందిన శిబిరాలపై దాడిచేసిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించినప్పుడు ఆయన పైవ్యాఖ్యలు చేశారు. రాజ్‌నాథ్‌ కార్గిల్‌లోనూ పర్యటించనున్నారు. క్రమేపీ కశ్మీర్లో ప్రశాంత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలను కలిసి ఈ ప్రాం తంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు తాను పర్యటిస్తున్నట్లు రాజ్‌నాథ్‌ తెలిపారు.