కాశ్మీర్ పర్యటనలో రాజ్నాథ్ సింగ్
శ్రీనగర్,జూన్7(జనం సాక్షి): కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ జమ్మూకాశ్మీర్ చేరుకున్నారు. రెండు రోజుల పాటూ ఆయన జమ్మూకాశ్మీర్ లో పర్యటించనున్నారు. అమర్ నాథ్ యాత్ర భద్రతతో పాటూ, సరిహద్దు భద్రతపై ఆయన సవిూక్ష నిర్వహించనున్నారు. ఉన్నతస్థాయి భద్రతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవల పాక్ రేంజర్లు పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో. .ప్రతి వ్యూహాలపై కూడా ఆయన ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన.. సీఎం మెహబూబా ముఫ్తీతో పాటూ, పలువురు మంత్రులను కలువనున్నారు.