కిటకిటలాడుతున్న కృష్ణా తీరం

krishna-pushkaraluకృష్ణా తీరం కుంభమేళాను తలపిస్తోంది. మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లోని పుష్కరఘాట్లకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి పునీతమవుతున్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో పుష్కరఘాట్ల వద్ద భక్తుల సంఖ్య పెరుగుతోంది. భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.