కుటుంబ కలహం – వ్యక్తి ఆత్మహత్య

రామారెడ్డి   జనంసాక్షీ    సెప్టెంబర్ 16  :
కుటుంబ కలహాలు క్షణికావేశంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన రామారెడ్డి  మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకుందని ఎస్ఐ అనిల్ కుమార్  వెళ్లడించారు. ఎస్ఐ  తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. మృతుడ  రామారెడ్డి తుర్కాశీ కాలనీకి చెందిన షేక్ మస్తాన్( 35 ) ఇంట్లో తరచూ గొడవలు చోటు చేసుకుంటాయి అదేవిధంగా  గురువారం మృతుడు తప్పతాగి రాత్రి కుటుంబ సభ్యులతో గొడవపడి,  క్షణికావేశంలో ఇంట్లో ఇనుప దులా నికి  ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి బార్య మదన్ బి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి  శవాన్ని  అనిల్ తెలిపారు. శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వివరించారు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. .
Attachments area