కూతురుపైనే అత్యాచారం చేసి చంపిన‌

images.jpeg666చెన్నై: కన్న కూతురన్న కనికరం కూడా లేకుండా చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, గొంతునులిమి హత్య చేసిన కసాయి తండ్రిని పోలీసులు అరెస్టుచేసి జైలుకు తరలించిన సంఘటన రామేశ్వరం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు రామేశ్వరం సమీపం కరయూర్‌ గ్రామంలోని సముద్రపు ఒడ్డున ఓ చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టంలో చిన్నారి అత్యాచారానికి గురై గొంతు నులిమి హత్య చేసినట్లు తెలిసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చేపట్టిన ప్రాథమిక విచారణలో అదే గ్రామానికి చెందిన మారి కుమార్తె అని తెలిసింది. తండ్రే కుమార్తెపై అత్యాచారానికి పాల్పడి హత్యచేసినట్లు తెలియడంతో బంధువుల ఇంట్లో తలదాచుకున్న మారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.