కూలిన మరో మిగ్.. క్షేమంగా బయటపడిన పైలట్లు

555బర్మెర్(రాజస్థాన్): మిగ్ విమానాలు కూలిపోవడం ఆగడం లేదు. ఇప్పటికే పలు విమానాలు ప్రమాదాల బారిన పడగా తాజా మిగ్-21 ఒకటి రాజస్థాన్‌లోని బార్మెర్‌లో ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఇందులోని ఇద్దరు పైలట్లు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనపై కోర్టు ఆఫ్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించింది.