కూలీలకు వ్యాక్సిన్ వేసిన వైద్య సిబ్బంది

మల్దకల్ఆగస్టు 30 (జనంసాక్షి) కరోనా వ్యాక్సిన్,రెండవ డోసు, బూస్టర్ డోస్ వేసుకోని వారికి వైద్య సిబ్బంది వ్యవసాయ పొలాల దగ్గరికి వెళ్లి మంగళవారం వ్యాక్సిన్ వేశారు. మండలంలోని వ్యవసాయ పొలాలలో వైద్య అధికారి సుప్రీత ఆధ్వర్యంలో పత్తిపంట పొలాలను తిరిగి కరోనా వ్యాక్సిన్ వేయించుకోని వారిని గుర్తించి వారికి అక్కడే కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. 30 ఏళ్ల పైబడిన వారి బీపీ షుగర్ చెక్ చేసి వారికి మందులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం నవీన, ఆశ వర్కర్ అనిత పాల్గొన్నారు.