కెసిఆర్ ఫ్లెక్సీ కి రాఖీలు కట్టిన మహిళలు..

ఎంపీపీ ఓలం చంద్రమోహన్ ఆధ్వర్యంలో

కేసముద్రం ఆగస్టు  జనం సాక్షి / మండల కేంద్రంలో శుక్రవారం రోజున ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీ కి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని స్థానిక ఎంపీపీ ఓలం చంద్రమోహన్ ఆధ్వర్యంలో రాఖీలు కట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు నజీర్ అహ్మద్,పట్టణ అధ్యక్షులు వీరు నాయక్,ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షులు సట్ల వెంకన్న,నీలం దుర్గేష్,కొమ్ము రాహుల్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.