కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌కు అస్వస్థత

rajnathకేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రి ఐసీయూలో రాజ్‌నాథ్‌కు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.