కేజీబీవీ విద్యార్థులకు వైద్య పరీక్షలు

-పీహెచ్ సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్
కుల్కచర్ల, జులై 29(జనం సాక్షి):
కుల్కచర్ల మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో 120 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.అనంతరం 20 మంది విద్యార్థులకు కార్బో వ్యాక్స్ టీకా ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ సురేష్,లావణ్య మాట్లాడుతూ..కస్తూర్బా గాంధీ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు అన్నారు.విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఎస్ఓ దేవి కిషన్, ఫార్మసిస్ట్ నరేందర్, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, ఏఎన్ఎం సూరమ్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area