కేరళ అసెంబ్లీ స్పీకర్ కన్నుమూత

కేరళ అసెంబ్లీ స్పీకర్ కన్నుమూత
 తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ స్పీకర్ జి. కార్తికేయన్(66) కన్నుమూశారు. కాలేయ కేన్సర్ తో బాధఫడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతదేహాన్నిఈ  సాయంత్రానికి కేరళ తరలించనున్నారు.

ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కార్తికేయన్ రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి ఒమన్ చాంది సంతాపం ప్రకటించారు. ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని రాజధాని తిరువనంతపురం చేరుకున్నారు.