కేసముద్రంలో ఆజాదీ కా గౌరవ్ పాదయాత్ర…

 

ప్రారంభించిన కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్

 

కేసముద్రం ఆగస్టు 10 జనం సాక్షి / మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ ఆజాదీ కా గౌరవ్ పాదయాత్రను ప్రారంభించారు.ఈ కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ల కావస్తున్న సందర్భంగా దేశభక్తిని చాటాలనే దృక్పథంతో ఏఐసీసీ,టి పి సి సి పిలుపులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు.యావత్ ప్రజానీకం,యువత ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయాలని సూచించారు.దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలతో పాటు కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి,ఏఐసీసీ జాతీయ నాయకులు బెల్లం నాయక్,జిల్లా నాయకులు డాక్టర్ మురళి నాయక్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నూనావత్ రాదా,పీసీసీ సభ్యులు దసృ నాయక్,ఓబీసీసీ జిల్లా అధ్యక్షులు మేకల వీరన్న యాదవ్,బండారు వెంకన్న,అల్లం నాగేశ్వరరావు,కత్తి స్వామి, అయ్యూబ్ ఖాన్,బాలు నాయక్, వసంతరావు, పరాంకుశం శ్రీహరి,మహమ్మద్ తాజొద్దీన్, బండారు దయాకర్,కూరెల్లి సతీష్,సుధాకర్, యూత్ నాయకులు శ్రవణ్ కుమార్,నునావత్ రమేష్,అల్లం గణేష్ ,కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.