కొనసాగుతున్న 28 వ రోజు లక్ష్మీదేవిపేట మండల సాధన సమితి రిలే దీక్ష

వెంకటాపూర్(రామప్ప)ఆగస్ట్20(జనం సాక్షి):-
నూతన మండలంగా లక్ష్మీదేవిపేటని ఏర్పాటు చేయాలని చేస్తున్న రిలే నిరాహారదీక్షలు 28 వ రోజుకి చేరాయి.అన్ని అనుకూలతలు,అన్ని వనరులు ఉన్న లక్ష్మీదేవిపేట గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేసే వరకు ఉద్యమం జరుగుతూనే ఉంటుందని,మండల సాధన సమితి నాయకులు తెలిపారు.
రిలే నిరాహారదీక్షలో మండల సాధన సమితి నాయకులు తండ రమేష్,గట్టు శ్రీనివాస్,బండ్ల రాజయ్య,అంతగిరి రాజు,జిముడ రాజు,పోరిక సీతారాం,బీరెల్లి సదయ్య,ఎమ్డీ.సాధీక్,గొడుగు సదయ్య,పత్తి రవి,కందికొండ రాజు,బండ్ల రాజయ్య, భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.