కొమటిపల్లిలో నులిపురుగుల నిర్మూలన మాత్రల పంపిణీ….

గ్రామ సర్పంచ్ నీలం యాకయ్య ఆధ్వర్యంలో

కేసముద్రం సెప్టెంబర్ 15 జనం సాక్షి / జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని గురువారం మండలంలోని కోమటిపల్లి గ్రామ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగు నివారణకు ఆల్బెండజోల్ మాత్రలను అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ నీలం యాకయ్య మాట్లాడుతూ… వ్యక్తిగత శుభ్రత,పరిసరాల పరిశుభ్రతలే ఆరోగ్యానికి రక్ష అని, విద్యార్థులుగా మీరు శుభ్రత పాటిస్తూ,ఇంటివద్ద పెద్దలు కూడా పాటించేలా చేసి తద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషిచేయాలంటూ విద్యార్థులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రుక్ముద్దీన్ గారు,ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి,మల్లయ్య,నరేందర్, నగేష్,కళ్యాణ్, మధుకర్ ,ఏఎన్ఎం మంజుల మరియు ఆశావర్కర్ విజయ తదితరులు పాల్గొన్నారు.