కొల్లూర్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

ఝరాసంగం ఆగస్టు 17 (జనంసాక్షి) మండల పరిధిలోని కొల్లూర్ గ్రామంలో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. బుధవారం ఎంపీటీసీ లక్ష్మి రాజ్ కుమార్ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం స్థానిక శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ప్రత్యేక చొరవ తీసుకొని మా గ్రామానికి నిధులు కేటాయించినందుకు గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు యువ నాయకులు చింతల్ ఘాట్ శివరాజ్ నాయకులు యాదయ్య సి.రాజు ,శ్యామేల్ తదితరులు పాల్గొన్నారు.