కోమటికుంట గ్రామ వాస్తవ్యులు ఎస్సై అశోక్ కుమార్ అనారోగ్యంతో మృతి

లింగాల జనం సాక్షి ప్రతినిధి:
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలో కోమటికుంట గ్రామానికి చెందిన అశోక్ కుమార్ కానిస్టేబుల్ నుండి విధులు నిర్వహిస్తూ ఎస్సైగా ప్రమోషన్ పొంది
షాద్నగర్ నియోజకవర్గం పరిసర ప్రాంతాలలో షాద్నగర్ కేశంపేట దేవరకద్ర గోపాలపేట పరిసర ప్రాంతాలలో విధులు నిర్వహించారు గత రెండు సంవత్సరాల క్రితం ఉద్యోగ విరమణ తీసుకున్నారు ఆయన సేవలు గుర్తించిన ప్రభుత్వం మళ్లీ తిరిగి ట్రాన్స్ కో, విజిలెన్స్ శాఖలో సేవలోకి మళ్లీ తీసుకుంది రెండు నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈరోజు ఆదివారం ఉదయం షాద్నగర్ తన సొంత ఇంట్లో తుది శ్వాస విడిచారు
ఈయనకు భార్య ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు సొంత గ్రామమైన కోమటికుంట నుండి బంధుమిత్రులు షాద్నగర్ వెళ్లి సంతాపం తెలియజేశారు