కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరం

టేకులపల్లి ,సెప్టెంబర్ 2( జనం సాక్షి): మండల పరిధిలోని కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో  సులానగర్ పీహెచ్సీ ఆధ్వర్యంలో  వైద్య శిబిరం శుక్రవారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 49 మంది కి వైద్య పరీక్షలు నిర్వహించి తగు చికిత్సను అందించారు. జ్వరంతో బాధపడుతున్న 3 గ్గురికి   రక్త పరీక్షలు చేశారు. గ్రామస్తులకు వ్యక్తిగత పరిశుభ్రత ఈ సీజన్లో వచ్చే వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లో అపరిశుభ్రమైన ఆహారం వీధుల్లోని ఆహారం తీసుకోవద్దని ఆహారం తీసుకునే ముందు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత అత్యంత పరిశుభ్రంగా చేతులు కడుకోవాలని  సూచించారు. ప్రతి ఒక్కరు కరోనా బూస్టర్ డోస్ వేయించుకోవాలని వైద్యాధికారి  సూచించారు. కరోనా ఈ సీజన్లో వచ్చే వ్యాధులు కీటక జనిత వ్యాధులపై అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం గ్రామంలోని ప్రతి ఇల్లు తిరిగి నిల్వ ఉన్న నీటిని తొలగించుకోవాలని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా దోమలు ఈగల ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు అని అన్నారు .ముఖ్యంగా ఈ వర్షాకాలం సీజన్ లో 20 నిమిషాలు మరగబెట్టి చల్లార్చిన నీటిని తాగటం ద్వారా నీటి ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు అని ప్రజలకు సూచించారు అత్యంత పరిశుభ్రంగా ఆకుకూరలు కాయగూరలు పావుగంట ఉప్పు నీళ్లలో నానబెట్టిన తర్వాత ప్రరిశుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే వాడుకోవాలని  కోరారు.ఈ కార్యక్రవ్మంలో స్థానిక సర్పంచ్ మాలోత్ రాజేందర్ నాయక్,  ఏఎన్ఎం లు వెంకటరమణ, రమాకుమారి, ఆశా ,కలమ్మ కార్యకర్తలుపాల్గొన్నారు.