కోల్‌ ఇండియా షేర్లు పతనం

న్యూదిల్లీ: నికర లాభంలో తగ్గుదలతో నేడు కోల్‌ ఇండియా షేర్లు పతనమయ్యాయి. జూన్‌ 30తో ముగిసిన త్రైమాసికంలో కోల్‌ఇండియా నికర లాభం 14.7శాతం పడిపోయింది. దీంతో నేడు మార్కెట్లో ఆ కంపెనీ షేర్లు దాదాపు 3శాతం పడిపోయాయి. కోల్‌ఇండియా నిన్న వెలువరించిన ఫలితాల్లో నికరలాభం 14.7శాతం క్షీణించినట్లు ప్రకటించింది. ఈ సంస్థ నికరలాభం రూ.3,065.28 కోట్లుగా పేర్కొంది. ఈ త్రైమాసికంలో విక్రయాలు కూడా 6.1శాతం పడిపోయి రూ. 17,796.05 కోట్లుగా నిలిచినట్లు నిన్న కోల్‌ఇండియా బీఎస్‌ఈకి తెలిపింది.