క్రీడా స్ఫూర్తి ని చాటేలా క్రీడా పోటీలు
: శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి
నల్గొండ బ్యూరో. జనం సాక్షి జిల్లా స్థాయి లో ఫ్రీడం క్రీడా పోటీలు ప్రారంభించిన శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి.# స్వతంత్ర భారత వజ్రో త్సవ వేడుకల సందర్భంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఫ్రీడం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు మంగళవారం మేకల అభినవ్ స్టేడియం లో నిర్వహించిన జిల్లాస్థాయి ఫ్రీడమ్ కప్ క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో ఆయా గ్రామాల్లో ఉత్సాహవంతులైన క్రీడాకారులు ఆగస్టు 11, 12 తేదీల్లో నిర్వహించిన వడ్డీ లాంగ్ జంప్ వాలీబాల్ , టగ్ ఆఫ్ వార్ క్రీడల్లో సుమారుగా 6100 మంది పాల్గొన్నారు. గ్రామస్థాయిలో విజేతలుగా;మొదటి స్థానం లో నిలిచిన జట్టులతో అన్ని మండలాల్లో సుమారుగా 3000 మంది ప్రథమ స్థానంలో నిలిచిన జట్టు క్రీడాకారులతో ఆగస్టు 13, 14 తేదీలలో క్రీడలను నిర్వహించడం జరిగినది. మండల స్థాయిలో విజేతలైన క్రీడాకారులు అన్ని మండలాల నుండి సుమారుగా 900 మంది క్రీడాకారులు జిల్లా స్థాయిలో మంగళవారం, బుధవారం(ఆగస్ట్ 16,17) నిర్వహించిన పోటీలలో పాల్గొంటారని తెలిపారు. క్రీడలలో విజేతలైన ప్రధమ, ద్వితీయ జట్లకు ఆగస్టు 18 తేదీన మెమెంటోలు అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఆగస్టు 8 నుండి వివిధ రకాల కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.ఇదే స్ఫూర్తిని ఆగస్ట్ 22 వరకు నిర్వహించు కార్యక్రమాలలో కొనసాగించాలని ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ ,జిల్లా యువజన క్రీడల అధికారి. మక్బూల్ అహ్మద్ ,జిల్లా అధికారులు, ఉద్యోగులు క్రీడాకారులు పాల్గొన్నారు.తొలుత శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,ప్రజా ప్రతి నిధులతో కలిసి,జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి,అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,జిల్లా అధికారుల తో వాలీ బాల్ అడి ఉత్సాహ పరిచారు.