క్షమించమన్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌

ముంబై,మార్చి2(జ‌నంసాక్షి): తనకారణంగా ట్రాఫిక్‌ నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడడంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ముంబై ప్రజలకు క్షమాణ చెప్పారు. ట్రాఫిక్‌ ఓలీసులు చేసిన ఓవరాక్షన్‌కు జనాలు ఇబ్బంది పడ్డ విషయం తెలుసుకున్న సీఎం వెంటనే క్షమాపణ కోరారు. నావాల్ల ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కరికీ క్షమాపనలు కోరుతున్నానని ప్రకటించారు. ముంబైలోని నేషనల్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు వెళ్తున్న సీఎం కాన్వాయ్‌ కోసం పోలీసులు ట్రాఫిక్‌ను చాలాసేపు నిలిపివేశారు. ఎన్‌ఎస్‌సీఐ గేటు వద్ద కూడా క్లబ్‌ నిర్వహాకులు హల్‌చల్‌ చేశారు. సీఎం కాన్వాయ్‌ లోపలికి వెళ్లేవరకు ఎవరినీ అనుమతించేది లేదని మిగతా వాహనాలను నిలిపివేశారు. దీంతో బయటి వ్యక్తులతో పాటు ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు వచ్చిన సామాన్య జనాలు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇది తెలుసుకున్న సీఎం క్షమాపనలు కోరారు.