ఖుర్షీద్‌ను అడ్డుకున్న కేజ్రీవాల్‌ బృందం

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కేంద్ర న్యాయ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌కు చేదు అనుభవం ఎదురైంది. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ ఖుర్షీద్‌ను కేజ్రీవాల్‌ బృందం అడ్డుకుంది, ఖుర్షీద్‌కు  వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.