గణపతి లడ్డును వేలంపాటలో దక్కించుకున్న తెరాస యువ నాయకులు వంశీ

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- యాచారం మండల  పరిధిలోని నందివనపర్తి  గ్రామంలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి చివరి రోజు అంబేద్కర్ యూత్ అధ్యర్యం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జరిగిన లడ్డు వేలం పాటలో తెరాస యువ నాయకులు 27,300 రూపాయలకు లడ్డును  కైవసం చేసుకున్నారు తొమ్మిది రోజులుగా పూజలందుకున్న గణపతి లడ్డును కైవసం చేసుకోవడం తన అదృష్టంగా బావిస్తున్నానని అన్నారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.