గార్లలో భాజపా నాయకుల నిరసన దీక్ష

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్23(జనంసాక్షి)

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ను అరెస్టు చేసి ప్రజసంగ్రామ యాత్ర ని బగ్నం చెయ్యాలని కరీంనగర్ కి తీసుకెళ్ళి ఇంటి వద్ద గృహ నిర్భందం చేసిన పోలీసుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ గార్ల మండల కేంద్రములో మండల అధ్యక్షులు ఠాకూర్ జశ్వంత్ ఆదర్యంలో నల్ల బ్యాడ్జి లను ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి రావుక విమల్ కుమార్ జైన్ పాల్గొని మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం భాజపా కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులు పెట్టిన ఎన్ని కేసులు పెట్టినా కుంభకోణాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న తెరాస ప్రబుత్వని ప్రజలు తుంగలో తొక్కుతారని కుటుంబ పాలనను అంతమొందించి ప్రజలు భాజపా కే పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జంపాల శ్రీను, మండల ప్రధానకార్యదర్శి రావూరి నాగేంద్రబాబు, యువమోర్చా ప్రధానకార్యదర్శి ఎడ్ల రాజ శేఖర్, జనిమియా, బుచ్చిబాబు, దేవ ,సందీప్, శివకృష్ణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు