గీత కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం..

కౌండిన్య గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో

 

కేసముద్రం సెప్టెంబర్ 18 జనం సాక్షి / గత నెలలో తాటి చెట్టు పై నుండి పడి మరణించిన తాళ్ల పూస పల్లి వాస్తవ్యుడు గీత కార్మికుడు నరేటి బిక్షం కుటుంబానికి కౌండిన్య గౌడ సంక్షేమ సంఘం- మండల అధ్యక్షులు చిర్ర ఏకాంతం గౌడ్, ప్రధాన కార్యదర్శి చీకటి వెంకట్రాం నర్సయ్య,కోశాధికారి ఉటుకూరి అశోక్ ల చేతుల మీదగా5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడమైనది.ఈ సందర్భంగా అధ్యక్షులు చిర్ర యాకాంతం గౌడ్ మాట్లాడుతూ… మండలంలో ఏ గ్రామం వారైనా తాటిచెట్టు పై నుండి పడి మరణించిన గీత కార్మికుని కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందచేస్తామన్నారు.మండలంలోని గౌడ కుల బాంధవులకు కౌండిన్య గౌడ సంక్షేమ సంఘం అండదండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి సామకూరి నరసయ్య గౌడ్, కార్యవర్గ సభ్యులు గొర్రె వెంకన్న గౌడ్, తాళ్ల పూస పెళ్లి గౌడ కుల పెద్దలు, యువకులు పాల్గొన్నారు.