గుజరాత్‌లో సోనియా ప్రచారం: కేంద్ర నిధులేమయ్యాయని ప్రశ్న

మండ్వి: డిసెంబర్‌ 7(జనంసాక్షి):  కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ శుక్రవారం దక్షిణ గుజరాత్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మాండ్విలో ఒక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆమె గుజరాత్‌ ముఖ్యమంత్రి నరెంద్రమోడి లక్ష్యంగా విమర్శణాస్త్రాలు విసిరారు. రైతుల సంక్షేమాన్ని విస్మరించారని కేంద్రం నుంచి వచ్చే వేలకోట్ల నిధులు ఎమైపోయాయని అసలు నిధులన్ని ఎమైపోయాయో అర్థం కావడం లేదని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం నిష్ఫక్షపాతంగా అన్ని రాష్ట్రాలకు వేలకోట్ల రూపాయాలను ఇస్తోందని గుజరాత్‌లో ఆ డబ్బు దేనికి ఖర్చు పెట్టారో తెలియటం లేదని విమర్శించారు. డిసెంబర్‌ 13న  తొలిదశ ఓటింగ్‌ జరిగే ప్రాంతాల్లో సోనియా ప్రచారం చేశారు.