గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆర్‌డబ్య్లూఎస్‌ ఎఈ మృతి

మహబూబ్‌నగర్‌: జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెబ్బేరు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ కాలిక్‌ మృతి చెందారు. ఏఈ ప్రయాణిస్తున్న వాహన్నాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.