గొర్రెల మందపై చిరుత దాడి

కోడేరు: మహబూబ్‌నగర్‌ జిల్లా కోడేరు శివారులో చిరుతపులి బీభత్సం సృష్టించింది. గొర్రెల మందపై దాడి చేసి పొట్టేలును చంపి తినేసింది. ఈ ఘటన చూసిన గొర్రెల కాపరులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. చిరుతపులి దాడితో గొర్రెల మంద చెల్లాచెదురైంది. చిరుత సంచారంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.