*గోవుల అక్రమంగా రవాణా*

దేవరుప్పుల, అక్టోబర్ 11 (జనం సాక్షి):దేవరుప్పుల మండలం,గొల్లపల్లి బ్రిడ్జి దగ్గర అక్రమంగా తరలిస్తున్న ఆవులను శ్రీ రామలింగేశ్వర గోశాల సభ్యులు గమనించి వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో ఎనిమిది గోవులను  రాజు అనే వ్యాపారి  అనకాపల్లి సౌడవరం నుండి హైదరాబాద్ తుక్కగుడా  AP39TU 3551 నెంబర్ గల బులోరో వాహనంలో మార్కెట్ కు తరలిస్తున్నట్లు తెలుసుకున్న గోశాల సభ్యులు యాదాద్రి జిల్లా,గుండాల మండల పోలీస్ స్టేషన్ కు తరలించారు.