గోసంరక్షణ కోసం పగలు రాత్రి కష్టపడుతున్న విశ్వహిందూ పరిషత్ సభ్యులు,

రుద్రూర్ (జనంసాక్షి):
 గోసంరక్షణలో  భాగంగా రుద్రూర్ మండల కేంద్రం తో పాటు వివిధ గ్రామాలలో  అక్రమంగా గోవులను తరలింపును  అడ్డుకోవడానికి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో, ఇందుర్ జిల్లా ప్రచారాక్  పార్వతి మురళి , రుద్రూర్  ప్రఖండ అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్ , గణేష్ ,భాస్కర్ వెంకటేష్ , ప్రతి రోజు ప్రొద్దున ,సాయంత్రం అని తేడా లేకుండా ప్రతి ఊర్లో  గోవుల అక్రమ తరలింపుకు అడ్డు కట్టలు వేస్తున్నారు .  ఇందులో భాగంగానే  బుధవారం రోజున  3 కోడెలను తరలిస్తున్నా ఒక  టాటాఏస్   వ్యాన్ ను పట్టుకున్నారు, ఎక్కడ అక్రమ రవాణా జరిగిన  తమకు తెలపాలని , తెలిపారు,  ఈ అక్రమ తరలింపులో  కొందరి అధికారుల హస్తం ఉందని  అనుమానం వ్యక్తం చేశారు

తాజావార్తలు