గౌరవ వేతనం పెంచండి

గౌరవ వేతనం పెంచండి

బచ్చన్నపేట,( జనం సాక్షి)
గౌరవ వేతనం పెంచాలని బచ్చన్నపేట మండలంలో పనిచేస్తున్న బి ఎల్ వో లు శనివారం బచ్చన్నపేట తహసిల్దార్ విశాలాక్షిని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇచ్చే గౌరవ వేతనం పెంచాలని అదేవిధంగా ప్రతి ఓటరు నమోదు ఆన్లైన్లో చేయుటకు గాను నూతన ట్యాబులు ఇప్పించగలరని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలో పనిచేస్తున్నటువంటి బిఎల్ఓ లు పాల్గొన్నారు