గ్రామంలో అక్రమ ఇసుక రవాణా అరికట్టాలి

మక్తల్ జూలై 05 (జనంసాక్షి) మాగనూర్ మండలంలోని మంది పల్లి గ్రామ శివారులో గల పెద్ద వాగు నుంచి అక్రమ ఇసుక రవాణా అధికారుల అండదండలతో జోరుగా సాగుతుందని మందపల్లి గ్రామస్తులు అంటున్నారు గ్రామంలోని కొందరు అక్రమ ఇసుక రవాణా మక్తల్ కర్ని, ఖానాపూర్ పక్కల  గల kolpur గ్రామాలకు రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది ప్రజలు అంటున్నారు వాగులో నుంచి అక్రమ ఇసుక రవాణా జరగడం వల్ల వాగులో నీరు ఇంకి పోయి భూగర్భ జలాల్లో నీటి మట్టం తగ్గిపోవడంతో వేసుకున్న పంటలకు నీరందక ఎండి పోతు ఉన్నాయని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి మంచినీటిని అందించే బోరు కూడా వాగులో ఉన్నందున మంచినీటి ఎద్దడి  ఏర్పడుతుందన్నారు .అధికారులు స్పందించి వెంటనే అక్రమ ఇసుక రవాణా ను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు