గ్రామ శాఖ అధ్యక్షున్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

జనం సాక్షి కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం పేరపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొంగోని సదయ్య తండ్రి ఇటీవల మరణించగా సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు సదయ్యతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో రొంపి కుంట గ్రామ సర్పంచ్ కటకం రవీందర్ ఉపసర్పంచ్ గుమ్మడి సతీష్, నాయకులు మొండయ్య, భూస తిరుపతి, కోలా నరేందర్, కోలా నర్సాగౌడ్ తదితరులు ఉన్నారు.