ఘనంగా ఆశీర్వాద్ గోల్డ్ లోన్ బ్యాంక్ ప్రారంభోత్సవం..

ముఖ్య అతిథులుగా ఎంపీపీ చంద్రమోహన్,జడ్పిటిసి శ్రీనాథ్ రెడ్డి, ఎస్సై రమేష్ బాబు
 కేసముద్రం సెప్టెంబర్ 21 జనం సాక్షి  / మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆశీర్వాద్ గోల్డ్ లోన్ బ్యాంక్ ను రీజినల్ మేనేజర్ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ చంద్రమోహన్, జడ్పీటీపి శ్రీనాథ్ రెడ్డి, ఎస్సై రమేష్ బాబు విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఘనంగా  ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కేసముద్రం మండల వ్యాప్తంగా రైతులకు,ప్రజలకు సేవలందించడానికి ఆశీర్వాద్ గోల్డెన్ బ్యాంకు స్థానికంగా ఏర్పాటు చేయడం ఎంతో హర్షానియమన్నారు.బంగారు వస్తువులపై స్వల్ప వడ్డీతో రుణ సదుపాయం కల్పిస్తూ భవిష్యత్తులో తమ సేవలను మరింత విస్తృతం చేస్తూ అన్ని వర్గాలకు తోడ్పడుతూ సేవలు అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా మేనేజర్ అంజయ్య, సురేష్, ప్రవీణ్, బ్రాంచ్ మేనేజర్ రమేష్, అసిస్టెంట్ మేనేజర్ రాజు, స్టాఫ్ రాకేష్, ప్రశాంత్, స్వప్న, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.