ఘనంగా గంపజాతర

మల్దకల్ ఆగస్టు 20 (జనంసాక్షి) మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం శ్రావణమాసం సందర్భంగా మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గంప జాతర ఉత్సవమును ఏర్పాటు చేయగా స్వామివారు మేళ తాళాలతో కురువ డోల చప్పులతో పల్లకిలో ఊరేగింపుగా దేవరగట్టు కు వెళతారు.ఈ పల్లకి ఊరేగింపు వెనక భక్తులు తండోపతండాలుగా వెళ్లి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు ఇలా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ ఉత్సవం జరుగుతుంది అని ఆలయ అర్చకులు రమేషా చారి గారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు పట్వారి ప్రహ్లాద రావు కార్యనిర్వహణ అధికారి సత్యాచంద్రారెడ్డి అరవిందరావు వాల్మీకి పూజారులు తదితరులు పాల్గొన్నారు.