ఘనంగా చిందు యక్షగాన ప్రధమ కళోత్సవము…

వ్యవస్థాపక అధ్యక్షులు మేడిపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో

మహబూబాబాద్ : జనం సాక్షి / తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో సోమవారం రోజున జిల్లా కేంద్రంలో శ్రీ విఘ్నేశ్వర చిందు యక్షగాన వృత్తి కళాకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడిపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం చిందు యక్షగాన ప్రధమ కళోత్సవము ఘణంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ…ఆర్థికంగా వెనుక పడుతున్న చిందు యక్షగాన వృత్తి కళాకారుల కుటుంబాలను,గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తమ కళాకారులు చేసిన కార్యక్రమ సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వము తమని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎం రమణ, విజయ్ కుమార్,గడ్డం గోపి, జబర్దస్త్ రాజమౌళి ,జి రవి,జి యాకయ్య,జి వెంకట్,నరసయ్య, ఈ చంద్రమౌళి ,జి మురళి,జి కృష్ణ ,జి జనార్ధన్,జి బిక్షపతి,ఉమాపతి,ఎం సారయ్య,జి మీనా,కృష్ణ ,ఏం రణధీర్,జి శ్రీను తదితరులు పాల్గొన్నారు.